మహాత్మా జ్యోతిబాఫూలే కళాశాలలో జిల్లా విద్యార్థులకు సీట్లు కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్సీవోపై చర్యలు తీసుకోవాలని మాజీ జడ్పీటీసీ సభ్యుడు సంతోష్ ఆదివారం డిమాండ్ చేశారు. లక్షెట్టిపేట ఇంటర్ సీట్ల కౌన్సిలింగ్లో 500 మార్కులకుపైగా పొందిన వారిని మాత్రమే ఎంపిక చేయడాన్ని ఆయన అన్యాయమని పేర్కొన్నారు. విద్యార్థుల హక్కులను కాపాడేందుకు అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.