సివిల్ సప్లై హమాలీల నూతన రేట్ల ఒప్పందం జీఓ వెంటనే విడుదల చేయాలని సీఐటియు కొమురంభీం జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం కాగజ్నగర్లోని ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద హమాలీలు చేపట్టిన సమ్మెకు మద్దత్తు పలికి మాట్లాడారు. జీఓ వచ్చే వరకు సమ్మెను ఐక్యంగా కొనసాగించాలని జనవరి 6న జరిగే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ నాయకులు సత్యనారాయణ, హమాలీలు పాల్గొన్నారు.