కాగజ్నగర్ పట్టణంలో కొత్తపల్లి వెంకటలక్ష్మీ చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు, బిజెపి జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, డాక్టర్ అనితల ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటిపరీక్షలు నిర్వహించారు. శిబిరంలో 36 మంది రాగా వారిలో 16మందికి శస్త్రచికిత్స అవసరమని, లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి వారి సహకారంతో ఉచితంగా ఆపరేషన్లు చేపిస్తామన్నారు. ఉచిత కంటి శిబిరం ప్రతీమంగళవారం నిర్వహిస్తామన్నారు.