కాగజ్నగర్ మండలంలోని వంజిరి రైతు వేదికలో గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'వికసిత కృషి సంకల్ప అభియాన్' ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు హాజరయ్యారు. రైతులు శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో వ్యవసాయ సాగుశైలిలో మార్పు తేవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివకృష్ణ, నాగరాజు, రామకృష్ణ, శంకర్, శైలేష్, సృజన తదితరులు ఉన్నారు.