సరిహద్దులను భద్రంగా కాపాడుతున్న భారత ఆర్మీకి మద్దతుగా కాగజ్నగర్ మండలం ఈజ్గాం శివమల్లన్న ఆలయంలో శుక్రవారం సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. దేవాదాయ, ధర్మాదాయశాఖల ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా భారత ఆర్మీకి సంఘీభావంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, అరుణ్ లోయా, ప్రవీణ్ తదితరులుప పాల్గొన్నారు.