కాగజ్నగర్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అవుతుంది. దీంతో తాగునీరు కలుషితం అవుతుందని ప్రజలు వాపోతున్నారు. పైపులైన్ లీకేజీతో తాగునీరంతా వృథాగా పోతుందని పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైపులైనుకు మరమ్మతులు చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.