కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో గురువారం సీఐ తుత్తూరు శంకరయ్య ఆధ్వర్యంలో ప్రయాణికులకు పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, సైబర్ నేరాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్ లకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీకాంత్, అంజన్న, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.