కాగజ్నగర్లోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన లభించింది. విశ్రాంత ఉద్యోగులు, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు శరత్ మాక్స్ విజన్ ఐ ఆసుపత్రి కంటి వైద్య నిపుణులు హంసల్, నవీన్లు పరీక్షలు చేశారు. 12 మందికి పరీక్షలు నిర్వహించగా, 4గురికి శస్త్ర చికిత్సకు సిఫారసు చేశారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు జయదేవ్, నరసయ్య, కార్యదర్శి శివప్రసాద్ పాల్గొన్నారు.