హైదరాబాద్ నగరంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో గురువారం కాగజ్నగర్ మండలం మహాజన్ గూడ గ్రామానికి చెందిన ఎగ్గే లక్ష్మణ్ సోదరి స్వప్నకు ఎల్ఓసీ చెక్ అందజేశారు. హైదరాబాద్ లోని ఎంఎన్జే ఆసుపత్రిలో చికిత్స కోసమై సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 3 లక్షల ఎల్ఓసీ లెటర్ ను వారి సోదరి స్వప్నకు సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పీఏ అందజేయడం జరిగింది.