కాగజ్నగర్ పట్టణంలోని బస్ స్టాండ్ ఎదురుగా గల కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రంలో అమ్మవారు ఆదివారం శాకాంబరీ దేవి అమ్మవారిగా దర్శనమిచ్చారు. తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతిమణి కోనేరు రమాదేవి రుక్మిణిచే గోరింటాకు పండుగ, ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.