వేట కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి చెందిన ఘటన కాగజ్నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. అధికారులు, స్థానికులు వివరాల ప్రకారం. పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో వేసవికాలం దృష్ట్యా దాహార్తి తీర్చుకునేందుకు జనావాసాల్లోకి వచ్చిన చుక్కల దుప్పిపై వేట కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రగాయాలైన దుప్పి మృతి చెందింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని దుప్పిని ఖననం చేశారు.