కాగజ్నగర్ పట్టణ వాకర్స్ అసోయేషన్ ఆధ్వర్యంలో కాగజ్నగర్ మున్సిపల్ కమిషనర్ ఎస్ అంజయ్యకు ఓపెన్ జిమ్ ఏర్పాటుకై వినతిపత్రాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. ప్రతిరోజు ఎస్పియం క్రీడా మైదానంలో ఎంతో మంది క్రీడాకారులు, యువకులు, వృద్దులు, మహిళలు వాకింగ్ కు వస్తారని, వారికి వ్యాయామం చేసుకోవడానికి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినట్టైయితే బాగుంటుందని, వెంటనే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయగలరని కోరారు.