భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో శనివారం ముప్పై ఏడు కోట్లరూపాయల నిధులతో నిర్మించనున్న నూతన సబ్ స్టేషన్ ల నిర్మాణాలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, రాందాస్ నాయక్, తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు.