ప్రభుత్వ విద్యారంగ రక్షణ కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అలుగు బెల్లి నర్సిరెడ్డిని మరో మారు ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి పిలుపునిచ్చారు. శనివారం అశ్వారావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ర్యాలీ తీశారు. ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.