అశ్వారావుపేట మండలం దిబ్బగూడెం పంచాయతీ పాలగుంపు గ్రామంలో ప్రమాదవశాత్తు మూడు రోజుల క్రితం 4 ఇళ్లు దగ్ధం అయ్యాయి. బాధిత కుటుంబాలకు జూపల్లి సేవా సమితి ఆధ్వర్యంలో సుమారుగా రూ. 10వేల ఇంటి సామాగ్రిని చిప్పల బాబు రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జూపల్లి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.