అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల పంచాయతీరాజ్, ఐటీడీఏ (ITDA) అధికారులతో గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులు, ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాలు, ఇంకా భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమగ్రంగా చర్చించారు.