భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రంగువారిగూడెం గ్రామంలో గురువారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు. రైతులకు భూస్వాములు ఎలాంటి సమస్యలు లేకుండా తమ హక్కులను రిజిస్టరు చేసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తోందన్నారు.