దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన మేకల గుంపులోకి ఓ దుప్పి పిల్ల శుక్రవారం కలిసిరావటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే మేకలమందలో దుప్పిపిల్ల కలిసిందని దమ్మపేట అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. స్పందించిన అటవీ రేంజ్ అధికారి కరుణాకరాచారి తన సిబ్బందితో కలిసి దుప్పిపిల్లను స్వాదీనం చేసుకొని కిన్నెరసాని అభయారణ్యనికి తరలించారు.