దమ్మపేట: సమస్య తీర్చిన మంత్రికి గ్రామస్థుల ధన్యవాదాలు

67చూసినవారు
దమ్మపేట: సమస్య తీర్చిన మంత్రికి గ్రామస్థుల ధన్యవాదాలు
దమ్మపేట మండలంలోని పూసుకుంట గ్రామంలో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని గ్రామస్థులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి బోరును మంజూరు చేయించారు. శనివారం ఆ బోరు పనులను స్థానిక అధికారులు ప్రారంభించగా గ్రామస్థులు మంత్రి తుమ్మలకు ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్