అన్నపురెడ్డిపల్లి మండలం రాజపురంలో సాంప్రదాయ నృత్యమైన కోలాటం నేర్చుకుంటున్న పలువురు మహిళలకు, చిన్నారాలుకు మాజీ ఎంపిటిసి భీమిరెడ్డి వెంకటరామిరెడ్డి-కవిత దంపతులు 42 మంది మహిళలకు రూ. 22 వేలు విలువగల గజ్జెలను బహుకరించారు. గత నెల రోజుల నుండి గ్రామంలో గల సాయిబాబా మందిరం ఆవరణంలో లచ్చన్నగూడేనికి చెందిన అంజిబాబు గురువు మహిళలకు కోలాటం నేర్పించారు. ఈ కార్యక్రమంలో రమాదేవి, సమత, యామిని, నాగమణి, పూజిత పాల్గొన్నారు.