ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి అశ్వారావుపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3: 30 గంటలకు కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో కార్మికుల సమస్యలపై అధికారులతో చర్చిస్తారు. ఆ తర్వాత 6 గంటలకు చుంచుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తారు. ఈ మేరకు ఖమ్మంలోని ఎంపీ క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన వెలవడింది.