దమ్మపేటలో బస్టాండ్ సాధనకై ఏడు రోజులుగా చేపడుతున్న రిలే నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఏడో రోజు రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబళ్ల రవి, వాసం పోలయ్య, సున్నం శ్రీను నిరసనకు మద్దతు తెలిపారు. బస్టాండ్ నిర్మాణం అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.