భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ఏపీ హైకోర్టు జడ్జి గోపాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమమూర్తులను దర్శించుకున్నాక శ్రీ లక్ష్మీతాయారమ్మవారి సన్నిధిలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో భద్రాచలం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శివనాయక్, ఆలయ ఏఈఓ శ్రావణ్ కుమార్ తదితరులు ఉన్నారు.