భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని శనివారం గో పూజా కార్యక్రమం, హోమం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పాకిస్థాన్ ఉగ్రదాడులకు వ్యతిరేకంగా భారత్లో శాంతి స్థాపన కోసం ప్రత్యేక పూజలు చేశారు. త్రివిధ దళాలు చేస్తున్న కృషి విజయవంతం కావాలని స్వామివారిని ఆలయ ఈవో రమాదేవి కోరుకున్నారు.