భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారిని దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, అధికారులు బుధవారం దర్శించుకున్నారు. రామాలయ అభివృద్ధిపై చర్చించేందుకు భద్రాచలం వారు ముందుగా అధికారులతో చర్చించారు. చర్చల తర్వాత రాములవారిని దర్శించుకుని, వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.