వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి గ్రామంలో ఆదివారం ముత్యాలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ముత్యాలమ్మ జాతరను గొంది ఇంటి పేరు ఉన్న కుటుంబాల వారు వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామ సమీపంలోని గుట్ట నుంచి ముత్యాలమ్మ దేవతను గ్రామంలోకి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ఈ క్రమంలో భక్తులు అక్కడికి చేరుకొని అమ్మవారికి ఎదురెళ్లి వరం పట్టారు. అనంతరం భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించారు.