భద్రాచలం గిరిభవన్లో ఈనెల 11న నిర్వహించే చేనేత ఉత్పత్తుల ఎంపిక కార్యక్రమాన్ని 19వ తేదీకి వాయిదా వేసినట్లు భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తికర గిరిజన ఉత్పత్తిదారులు మాత్రమే తమ యొక్క ఉత్పత్తుల నమూనాలతో ఈనెల 19 ఉదయం 10 గంటలకు గిరిజన భవనంలో జరిగే ఎంపిక కార్యక్రమంలో కుల ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆధార్ కార్డులతో హాజరు కావాలని పేర్కొన్నారు.