భద్రాచలాన్ని ఒక్క గ్రామపంచాయతీగానే ఉంచాలనడం హాస్యాస్పదమని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ అన్నారు. బుధవారం ఐటీడీఏ ధర్నా చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భద్రాచలంలో సుమారుగా 60 వేలు పైగా జనాభా నివసిస్తున్నారని, వీరికి పాలనా సౌలభ్యం కోసం మూడు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే వలస గిరిజనేతరులకు మింగుడు పడటం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు.