భద్రాచలం బ్రిడ్జి సెంటర్లోని తాగు నీటి పైపు లైను ఎయిర్ వాల్వుకు బుధవారం రాత్రి భారీ లీకు ఏర్పడింది. ఓ లారీ వాల్వును ఢీకొనడంతో అది దెబ్బతింది. దాదాపు 15 అడుగుల ఎత్తుకు నీళ్లు ఎగసిపడ్డాయి. ఈ సమాచారం తెలుసుకున్న ఆర్. డబ్ల్యూ. ఎస్ డీఈ శ్రీనివాసరావు తన సిబ్బందిని పంపించి మరమ్మతులు చేపట్టారు.