భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో శనివారం పీఆర్టీయూ (PRTU) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి సమక్షంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ జిల్లా అధ్యక్షుడు డి. వెంకటేశ్వరరావుతో పాటు ఇతర సభ్యులను అకారణంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ పీఆర్టీయూ ఉపాధ్యాయులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. సస్పెండ్ చేసిన వారిని వెంటనే తిరిగి అదే పదవుల్లో కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.