బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోగల గాంధీనగర్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు గూగుల్ రాంబాబు వాళ్ళ మేనమామ భూక్యా లచ్చిరాం (65) అనారోగ్యంతో శనివారం అకాల మరణం చెందారు. ఆ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ గాంధీనగర్ కమిటీ అధ్యక్షులు తిరుపతి చంటి, శంకర్, సాయి మృతుని ఇంటికి వెళ్లి వారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.