ఈనెల 5 నుండి 9 వరకు అన్ని గ్రామాల్లో స్వచ్ఛదనం- పచ్చదనం అనే పేరుతో గ్రామాల్లో పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం హైదరాబాదు నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు.