భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు సోమవారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల అధికారులతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాను నిర్మూలించేందుకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు.