ఈనెల 31న ఐటీసీ సారపాకలో జరుగు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ మిత్రపక్షాలు గెలుపు సాధించి ఐటీసీ లో ఐఎన్టీయూసీ జెండా ఎగురవేయాలని మాజీ కేంద్ర మంత్రి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ అన్నారు. శుక్రవారం ఐటీసీ గెస్ట్ హౌస్ లో ఐఎన్టీయూసీ మిత్రపక్షాల నాయకులతో సమావేశమైన సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ ఐఎన్టీయూసీ కార్మిక సంఘానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తన వంతు సహకారాలు అందిస్తామని అన్నారు.