ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో జరిగాయని, అర్హులైన తమకి కాకుండా అనర్హులకు ఇళ్ళు కేటాయించారని ఆరోపిస్తూ జూలూరుపాడు మండల పరిధిలోని మాచినేనిపేట తండా గ్రామస్తులు మహిళలు గ్రామపంచాయతీ కార్యాలయ గేటుకు తాళం వేసి శుక్రవారం ఆందోళన చేపట్టారు. గ్రామపంచాయతీ కార్యదర్శి కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగానే గ్రామస్తులు కార్యాలయ గేటుకు తాళం వేసి తమ ఆందోళన చేపట్టారు.