
పాక్ సైన్యాధిపతిగా సాహిర్ షంషాద్ మీర్జా?
భారత్తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మున్నీర్ ఆచూకీ తెలియకపోవడం చర్చనీయాంశంగా మారింది. యుద్ధ వాతావరణం ముంచుకొస్తున్న వేళ మున్నీర్ పరారై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ విదేశాలకు వెళ్లినట్టు సమాచారం. తాజా పరిణామాల్లో పాకిస్థాన్ సైన్యానికి నాయకత్వం అందించేందుకు సాహిర్ షంషాద్ మీర్జా పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.