సింగరేణిలో పని చేసి దిగిపోయిన ఉద్యోగులకు కోల్ మైన్స్ పెన్షన్ స్కీం-1998 ప్రకారం కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ వారు గత సంవత్సరం మార్చి 8వ తేదీ నుంచి కనీస పెన్షన్ రూ. 1000 చెల్లిస్తున్నారని అన్నారు. లైఫ్ సర్టిఫికెట్ లు సమర్పించని 1818 మంది పెన్షన్ దారులు ఆన్ లైన్ లో జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సీఎంపిఎఫ్ అధికారులకు సమర్పించి పెన్షన్ పొందాలని శుక్రవారం సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి ఎ. వేణు మాధవ్ తెలిపారు.