ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ. 2వేల కోట్లతో 10 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకవైపు ఐటీ రంగం, మరోవైపు విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.