ఉపాధ్యాయులు పోక్సో చట్టం, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెంలో ఉపాధ్యాయులకు జరుగుతున్న వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా పోక్సో చట్టం, బాలికల అక్రమ రవాణా, సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పించారు.