జిల్లా కలెక్టరేట్లోని ఇందిరా మహిళా శక్తి కాంటీన్ నిర్వాహకులను డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ రఘురాం రెడ్డి శనివారం ఆత్మీయంగా పలకరించారు. ఎలా ఉన్నారమ్మా, వ్యాపారం బాగా సాగుతుందా అని అడిగారు. ఎమ్మెల్యేలు కూనంనేని, రాందాస్ నాయక్లతో కలిసి క్యాంటీన్లో కాఫీ తాగారు. లాభసాటిగా సాగుతుందా వ్యాపారం అని అడగగా, బాగుందంటూ నిర్వాహకులు సమాధానమిచ్చారు.