భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిధులు మంజూరై ఉండి పూర్తికాని పనులు సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. బుధవారం జిల్లాలో పురోగతిలో ఉన్న యాస్పిరేషనల్, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఎస్పీ రోహిత్ రాజ్, పీవో రాహుల్, అదనపు కలెక్టర్ విద్యా చందనతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2022-23, 2023-24 మంజూరైన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అన్నారు.