సేవాలాల్ బంజారా సంఘం గురువారం కొత్తగూడెం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం నందు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కు మెమోరడం ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో సేవాలాల్ బంజారా సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్ మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నందు 49 నోటిఫికేషన్ ద్వారా జరిగిన ఔట్ సోర్సింగ్ నియామకాల్లో జరిగిన అవకతవకలపై తగిన విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.