బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే మనందరి లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి అన్నారు. కొత్తగూడెంలోని చిన్నబజార్, పెద్దబజార్ లోని దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కార్మికశాఖాధికారి మహ్మద్ షరీఫుద్దీన్, సిబ్బందితో కలిసి బుధవారం తనిఖీలు చేపట్టారు. 14ఏళ్లలోపు పిల్లలను పనిలో నియమిస్తే చట్టప్రకారం యజమానిపై కేసు నమోదు చేస్తామని భానుమతి హెచ్చరించారు.