తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో నష్టపోయిన ఉద్యమకారులకు సహాయం చేయాలని తెలంగాణ జనసమితి (టీజేఎస్) నాయకులు డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం తమను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన 'మాదిమాండ్స్' పథకాన్ని అమలు చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్, పాల్వంచ తహసీల్దార్ కార్యాలయాలకు టీజేఎస్ నాయకులు మెమోరాండం సమర్పించారు.