పాల్వంచ పట్టణం మరియు పరిసర ప్రాంతాలలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
33KV పాల్వంచ ఫీడర్ లైన్, 33/11 KV పాల్వంచ, మరియు 33/11KV సీతారాంపట్నం సబ్స్టేషన్లలో మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ నిలిపివేయబడుతుంది. ఈ అంతరాయం పాల్వంచ టౌన్లోని మార్కెట్ ఏరియా, గాంధీనగర్, కరకవాగు, టీచర్స్ కాలనీతో పాటు పాత పాల్వంచ, నవభారత్, పాలకోయ తండా ప్రాంతాలపై ప్రభావం చూపుతుంది. వినియోగదారులు సహకరించాలని TGNPDCL విజ్ఞప్తి చేసింది.