జిసిసి ద్వారా గిరిజనుల నుండి సేకరించే అటవీ ఫలాలు, ఆశ్రమ పాఠశాలలకు, వసతి గృహాలకు, సరఫరా చేసే సామాగ్రికి సంబంధించిన ప్రతి వస్తువు రిజిస్టర్ లో నమోదు చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. శనివారం పాల్వంచ లోని జిసిసి కార్యాలయంలోని రికార్డులను ఆయన పరిశీలించారు. జిసిసి కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.