జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులను పండుగ వాతావరణంలో స్వాగతించాలని అడిషనల్ కలెక్టర్ విద్యా చందన సూచించారు. పాఠశాలలను అలంకరించి, ఉచిత పుస్తకాలు/యూనిఫాంలు ముందుగానే అందజేయాలన్నారు. బడిబాట కార్యక్రమం కింద పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలి. పరిశుభ్రత, ఇంకుడు గుంతలు, మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలి. 100% నమోదు, బడిబయటి పిల్లలు లేని
గ్రామంగా మార్చాలని డీఈఓ వెంకటేశ్వర చారి ఆదేశించారు.