భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీస్ పెట్రోలింగ్ లో భాగంగా సోములగూడెం వెళ్లే దారిలో నాయక్ తండా పరిధి జామాయిల్ తోట వద్ద ఆదివారం నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ఉండగా.. వారిని సోదా చేయగా వారి వద్ద రూ. 19 వేల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న వారిలో ధరావత్ చరణ్, షేక్ షాకీర్, ధర్మ సొత్ శ్రీరామ్, బానోత్ గోపి లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.