బూర్గంపాడ్ మండల కేంద్రంలో ఫుట్ పాత్పై అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై గ్రామపంచాయతీ అధికారులు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 37 మందికి ఆర్అండ్బీ అధికారులు నోటీసులు జారీ చేయగా, ప్రస్తుతం 25 మందికి నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందించి అక్రమ నిర్మాణాలు, డ్రైనేజీ ఆక్రమణలు తొలగించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.