బూర్గంపాడు మండల వ్యాప్తంగా సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి రెడ్డిపాలెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ కుల, మత వర్గాలకు అతీతంగా రాజ్యాంగం ద్వార అందరికి హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబా సాహేబ్ అంబేడ్కరుడని కొనియాడారు.